తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు
మీరు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యమైతే
మీ టిక్కెట్ రిఫండ్ వస్తుందా .
2014 ముందు వరకు భారతీయ రైల్వే అంటే ఆలస్యానికి ప్రతిరూపం. ఏ సమయంలో ఏ రైలు ఏ స్టేషన్లో ఉంటుందో తెలియని పరిస్థితి .మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ పరిస్థితుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ట్రాక్లను మార్చి వేగ పరిమితిని పెంచటం, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ,సిబ్బంది నియామకం, వందే భారత్ రైళ్ల ప్రవేశంతో భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోయాయి .
దేశవ్యాప్తంగా ఉన్న వేలాది రైళ్లు ప్రతిరోజు 90% వరకు అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాక్ల మరమ్మత్తులు, వాతావరణ మార్పులు ….ఉదాహరణకు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, అడవి ప్రాంతాల్లో రైలు పట్టాలు దాటుతూ అడవి జంతువులు రైలు కిందపడి దుర్మరణం చెందడం, ప్రజల ఆత్మహత్యలు ,పట్టాల మధ్య ఉన్న కప్లింగ్ లు లూస్ అవ్వటం, నేర చర్యలు తదితర కారణాలతో కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ చేసేందుకు వీలుగా రైల్వే శాఖ టిడిఆర్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
మూడు గంటలకు మించి ఆలస్యమైతే ..
మనం వెళ్లాల్సిన రైలు మూడు గంటల కు మించి ఆలస్యం అయితే గతంలో ప్రయాణికులు తమ డబ్బులను వదులుకొని ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకునేవారు. దీనిపై విమర్శలు రావడంతో రైల్వే శాఖ ఒక రిఫండ్ స్కీంను ప్రవేశపెట్టింది. అదే టి డి ఆర్. దీన్ని ఉపయోగించుకొని ఎవరైనా రైలు ప్రయాణం ఆలస్యం అయినప్పుడు రిఫండ్ను పొందవచ్చు
నియమ నిబంధనలు …
1.తాము వెళ్లాల్సిన రైలు టికెట్ బుక్ చేసుకున్న స్టేషన్ నుంచి మూడు గంటలకు పైగా ఆలస్యం అవ్వా లి. అదే సమయంలో ప్రయాణికుడు తన ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలో.. అప్పుడే ఈ రిఫండ్ పొందటానికి అర్హులవుతారు .
2.రైలు రద్దు అయిన కొన్ని సందర్భాల్లో, రైళ్లు మార్గం మారి నా ఈ రిఫండ్ పొందటానికి అవకాశం ఉంటుంది
3.మీరు ఏసీ కోచ్ లో టికెట్ బుక్ చేసుకున్నారు. అనివార్య కారణాల వల్ల రైల్వేలో ఆ ఏసీ కంపార్ట్మెంట్లో తక్కువ ఉండి మిమ్మల్ని స్లీపర్లో జర్నీ చేయమని కోరితే ఆ సమయంలో కూడా మీరు టికెట్ క్యాన్సిల్ చేసుకుని రిఫండ్ పొందటానికి అర్హులవుతారు.
4.నిర్వహణ లోపాల కారణంగా భారతీయ రైల్వేలో ప్రతిరోజు పదుల సంఖ్యలో కంపార్ట్మెంట్లలో ఏసీలు మరమ్మతులకు గురవుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా ప్రయాణికులు ఈ రిఫండ్ పొందటానికి వీలుంటుంది.
ఈ రైళ్లలో ఈ సమయంలో ప్రత్యేక సౌకర్యాలు ..
రాజధాని, శతాబ్ది, దూరంతో ప్రీమియం రైలు రెండు గంటలకు పైగా ఆలస్యమైతే ఆ రైలు టికెట్ బుక్ చేసుకున్న వారికి ఉచితంగా టిఫిన్ లేదా భోజనం పొందే అవకాశం ఉంటుంది.
రిఫండ్ పొందండి ఇలా ...
1. ముందుగా ఐఆర్సిటిసి వెబ్సైట్లో లాగిన్ కావాలి.
2. అనంతరం టి డి ఆర్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
3. మీ టికెట్ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయాలి
4. టికెట్ రద్దు చేసుకోవడానికి గల కారణాలను సెలెక్ట్ చేయాలి
5. మీతోపాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారో వారి వివరాలు కూడా నమోదు చేయాలి
6. అన్ని వివరాలు పక్కాగా నమోదు చేయగానే సబ్మిట్ అని క్లిక్ చేయాలి
గడువు సమయం
1. రైలు బయలుదేరిన సమయం నుంచి 72 గంటల్లోపు టిడిఆర్ కు దరఖాస్తు చేయాలి.
2. ఏసీ పనిచేయని సందర్భంలో గమ్యస్థానానికి చేరుకున్న వెంటనే టి డి ఆర్ కు దరఖాస్తు చేసుకోవాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు ..
ప్రతి ఆలస్యానికి టీడీఆర్ అనేది రాదు. రైల్వే శాఖ నియమ నిబంధనలు అనుసరించే ఈ సౌకర్యం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రైల్వే శాఖ వారు ముందస్తుగా ప్రకటించిన రైళ్ల రద్దు, రూట్ల మార్పు తదితర సమయాల్లో ఈ టీడీఆర్ స్కీమ్ అనేది వర్తించదు. ప్రయాణికులు రైల్ టికెట్ బుక్ చేసుకున్న దగ్గర్నుంచి రైల్వే శాఖ వారు విడుదల చేసే ప్రకటనలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.
మీ ప్రయాణం సుఖమయం అవ్వాలని కోరుతూ సెలవు.
భారతీయ రైల్వే ప్రపంచ స్థాయిలో ప్రయాణికులకు నెంబర్ వన్ గా సేవలందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
Comments
Post a Comment