Posts

తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

బంగారం, వెండి ధరలు 3.6.26, బుధవారం

  ఈ రోజు బంగారం ధరలు  24 క్యారెట్స్ :  1 గ్రాము - ₹15621 10 గ్రాములు - ₹156210 22 క్యారెట్స్ గోల్డ్ : 1 గ్రాము - ₹14319 10 గ్రాములు - ₹143190    సిల్వర్ : 1 గ్రాము - ₹289.90 1 కిలో - ₹289900

🕉️ June 03, 2026 Telugu Panchangam | Today Tithi, Nakshatram & Muhurtham

 🛕నేటి పంచాంగం 🕉️  జూన్ 03 2026 (బుధవారం) ⏰ ఈ రోజు శుభ సమయాలు, రాహుకాలం, అమృతకాలం తెలుసుకోండి! 🙏శ్రీ పరాభవ నామ సంవత్సరం ☀️ ఉత్తరాయణం | గ్రీష్మ ఋతువు 🌙 అధిక జ్యేష్ఠ మాసం | కృష్ణ పక్షం 🔹 తిథి: తదియ (సా. 6:43 వరకు) 🔹 నక్షత్రం: పూర్వాషాఢ (రా. 10:56 వరకు) 🔹 యోగం: శుభం (ఉ. 7:03 వరకు) 🔹 కరణం: వణిజ (ఉ. 5:48 వరకు), తరువాత భద్ర (సా. 6:43 వరకు) ⏰ వర్జ్యం: ఉ. 7:05 – 8:51 ⏰ దుర్ముహూర్తం: ఉ. 11:31 – 12:23 ⏰ అమృతకాలం: సా. 5:39 – 7:25 ⏰ రాహుకాలం: మ. 12:00 – 1:30 ⏰ యమగండం: ఉ. 7:30 – 9:00 ♉ సూర్యరాశి: వృషభం ♐ చంద్రరాశి: ధనుస్సు 🌅 సూర్యోదయం: ఉ. 5:28 🌇 సూర్యాస్తమయం: సా. 6:27 🙏 శుభోదయం 🙏                 ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం మా  TELUGU NEWS ROOM 🗞️ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి.

దోచుకున్న డబ్బులు తిరిగి ఇస్తాను అందరూ వచ్చి తీసుకెళ్లండి

Image
దీదీకి దిమ్మ తిరిగింది   పశ్చిమబెంగాల్ .. భారతదేశ తూర్పు తీర రాష్ట్రమైన ఈ పశ్చిమ బెంగాల్ ని గత దశాబ్దం పాటు మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా పాలించారు. ఆ సమయంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పింది .అవినీతి, అక్రమాలు విచ్చలవిడిగా పెరిగిపోయాయి. మహిళలకు, యువతలకు రక్షణ లేకుండా పోయింది .ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీ పై ,మమతా బెనర్జీ పై బెంగాల్ ప్రజలు అసంత్రుప్తి చెందారు. కమల వికాసంతో  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా 208 స్థానాల్లో విజయం సాధించి బెంగాల్ ను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా సురేందు అధికారి బాధ్యతలు తీసుకున్నాక పాలనలో మార్పులు తీసుకొచ్చారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించారు. రౌడీలు, గుండాలు హంతకులపై ఉక్కు పాదం మోపుతున్నారు. అంతేకాక గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడి కోట్లు సంపాదించిన వారిపై కేసులు పెట్టి విచారణ చేస్తున్నారు .వారి అవినీతిని బయటకు తీసి శిక్షలు పడేలా చేస్తున్నారు.  అక్రమార్కుల వెన్నులో వణుకు  మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ చేసిన అక్రమాల కారణంగా అతనిపై పలు నేరాలను నమోదు అయ్యాయి. దీనిలో భాగంగా అక్కడ...

విరాళాలు ఇచ్చే దాతలకు శ్రీవాణి టికెట్టు

Image
    తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు  శ్రీవాణి టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసింది. ఎవరైతే స్వామివారికి విరాళాలు ఇచ్చి దర్శనం కోసం వేచి ఉంటారో వారికి కొంత మేర శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. కేటాయింపులు ఇలా  ప్రతిరోజు సుమారు 1500 శ్రీవాణి టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు .వీటిలో 500 ఆన్లైన్లో,, 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో విక్రయిస్తున్నారు. మిగిలిన టిక్కెట్లను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ టిక్కెట్లలో 300 టికెట్లను దాతలకు కేటాయిస్తారు అర్హత 2025 మే ఒకటో తేదీ నుంచి విరాళాలు అందించిన దాతలు ఈ టికెట్లు పొందడానికి అర్హులు. ఈ విధానం అమలయ్యే తేదీ  జూన్ 10 నుంచి  టికెట్ల జారీ… దర్శన వేళలు  ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 300 టికెట్లు ఆన్లైన్ లో కేటాయిస్తారు .భక్తులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ టికెట్లు పొందాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారికి శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఒకవేళ ఈ టికెట్లు గనుక మిగిలిపోతే వాటిని శ్రీవాణి కరెంట్ బుకింగ్ లో విక్రయిస్తారు.  ఎప్పటి వరకు అమలు...

నవగ్రహాలు... అనుకూలతకు పాటించాల్సిన పరిహారాలు

Image
 జీవితంలో అనుకున్న లక్ష్యాలు అవలీలగా సాధించి సుఖసంతోషాలతో ఉండాలంటే మనకు నవగ్రహాలు అన్ని అనుకూలంగా ఉండాలి.. కొన్ని సమయాల్లో వాటి వల్ల మనకు సమస్యలు ఎదురవచ్చు ఈ సమస్యలు అధిగమించాలంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి. ఎల్లవేళలా సుఖసంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలుగుతాయి.  నవగ్రహాలు…. పాటించాల్సిన పరిహారాలు 1. సూర్యుడు.        ప్రతిరోజు ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి నీళ్ళు సమర్పించాలి. 2. చంద్రుడు .        ఉదయం లేచిన వెంటనే తల్లి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకోవాలి.  3.బుధుడు.          ఉదయాన్నే ఒక ఆకుపచ్చని పండు లేకపోతే కూరగాయ గాని తినాలి. 4. శుక్రుడు..      ప్రతిరోజు మీ ఒంటిపై సువాసన అందించే అత్తరును వాడాలి.  5. మంగళ (మార్స్)..  ప్రతిరోజు హనుమాన్ చాలీసా ను చదవాలి.  6. గురుడు….  ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం భుజించాలి.  7. శని….        కింది స్థాయి ఉద్యోగులు ,పనివారు ,యాచకులతో గౌరవంగా వ్యవహరించాలి  8. రాహు….  ఎల్లప్ప...

తలనీలాల సమర్పణలు రికార్డులు తిరగ రాసిన తిరుమల తిరుపతి దేవస్థానం

Image
  వెంకటేశ్వరుని సన్నిధిలో కలియుగ వైకుంఠం ,భక్తుల కోరికలు తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినీ ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తమ కోరికలు తీర్చి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు.  ఏటా తిరుమలలో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికల్ని వెంటనే నెరవేరుస్తున్నాడని అర్థం.  స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులు కూడా కోరికలు తీరిన వెంటనే కాలిమార్గాన కొండకు చేరుకొని తలనీనాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది తలనీలాల సమర్పణలో తిరుమల తిరుపతి దేవస్థానం తన రికార్డును అధిగమించింది.  గత ఐదు నెలల్లో .. గత ఐదు నెలల స్వామి వారికి 12 లక్షల మందికి పైన తలనీలాలు సమర్పించారు .ఈ ఏడాది మే 27 నాటికి 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. 2024 మే నాటికి 10.65 లక్షలు మంది తలనీనాలు ఇచ్చారు .ఇదే ఇప్పటివరకు రికార్డు. 2025 లో 10.18 లక్షల మంది ఇవ్వగా 2026 లో రెండు లక్షల మంది అధికంగా తలనీలాలు సమర్పించారు . ఏది ఏమైనా పడితే ...

విద్యార్థులు నిరుద్యోగులు నిరుద్యోగులకు పోస్టల్ ఫ్రాంచైజీ అవకాశం

Image
  ఈ కామర్స్ రంగం, ఇతర కొరియర్ సంస్థ ల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు పోస్టల్ శాఖ ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. వాడ వాడలా, పల్లె పల్లెనా తన సేవలు విస్తరించేందుకు వినియోగదారులకు వేగంగా వస్తువులు చేరవేసేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకువచ్చింది. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు, చిరు ఉద్యోగులకు, గృహిణులకు ఒక మంచి అవకాశం అడ్వాన్స్ పోస్టల్ టెక్నాలజీ 2.0  ఆధునిక పారదర్శక సేవలతో ఉపాధి అవకాశాన్ని పెంపొందించడమే దీని లక్ష్యం. స్పీడ్ పోస్ట్, డాక్యుమెంట్ బుకింగ్, పార్సిల్ బుకింగ్ ,ఇంటర్నేషనల్ బుకింగ్ పికప్ సేవలు, కాష్ ఆన్ డెలివరీ, ఇంటి నుంచి పార్సెల్ సేకరణ ..ఇలా రకరకాల సేవలు అందించవచ్చు. ఫ్రాన్సిసింగ్ గారు తమ అవకాశాన్ని బట్టి బుకింగ్ మాత్రమే, డెలివరీ మాత్రమే, పికప్ మాత్రమే, అన్ని సేవలు కలిపి ..అనే నాలుగు రకాల సేవలు ఎంచుకోవచ్చు .డెలివరీ సేవలు కోసం వాహనం ఉంటే సరిపోతుంది. బుకింగ్ సేవలకు చిన్న స్థలం స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్, ఇంటర్నెట్ ప్రింటర్ సదుపాయాలు ఉండాలి.  అర్హతలు   కనీస వయసు… 18 సంవత్సరాలు  బుకింగ్ సేవలకు… ఇంటర్ ఉత్తీర్ణత  డెలివరీ సేవలకు.. టెన్త్ పాస...