మీరు వెళ్లే రైలు 3 గంటలు ఆలస్యమైతే రిఫండ్ వస్తుందా? ఇండియన్ రైల్వే పూర్తి నిబంధనలు
మీరు వెళ్లే రైలు మూడు గంటలు ఆలస్యమైతే మీ టిక్కెట్ రిఫండ్ వస్తుందా . 2014 ముందు వరకు భారతీయ రైల్వే అంటే ఆలస్యానికి ప్రతిరూపం. ఏ సమయంలో ఏ రైలు ఏ స్టేషన్లో ఉంటుందో తెలియని పరిస్థితి .మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక ఈ పరిస్థితుల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ట్రాక్లను మార్చి వేగ పరిమితిని పెంచటం, అధునాతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ,సిబ్బంది నియామకం, వందే భారత్ రైళ్ల ప్రవేశంతో భారతీయ రైల్వే రూపురేఖలు మారిపోయాయి . దేశవ్యాప్తంగా ఉన్న వేలాది రైళ్లు ప్రతిరోజు 90% వరకు అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ట్రాక్ల మరమ్మత్తులు, వాతావరణ మార్పులు ….ఉదాహరణకు భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం, అడవి ప్రాంతాల్లో రైలు పట్టాలు దాటుతూ అడవి జంతువులు రైలు కిందపడి దుర్మరణం చెందడం, ప్రజల ఆత్మహత్యలు ,పట్టాల మధ్య ఉన్న కప్లింగ్ లు లూస్ అవ్వటం, నేర చర్యలు తదితర కారణాలతో కొన్ని రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు టికెట్ చేసేందుకు వీలుగా రైల్వే శాఖ టిడిఆర్ టికెట్ డిపాజిట్ రిసిప్ట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. మూడు గంటలకు మించి ఆలస్యమైతే .. మనం వెళ్లాల్సిన రైలు...