తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు
దేశంలోని పలు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. మారుతున్న వాతావరణం నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (IMD) కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
దక్షిణ, పశ్చిమ, మధ్య భారతాల్లో...
దక్షిణ భారతంలోని కొన్ని రాష్ట్రాలతో పాటు పశ్చిమ, మధ్య భారత ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తత..
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడే అవకాశం ఉందని, అత్యవసర పరిస్థితులు తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. రైతులు కూడా స్థానిక వ్యవసాయ శాఖ సూచనలను పాటించాలని కోరారు.
ప్రజలకు సూచనలు
- వాతావరణ శాఖ తాజా హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించండి.
- ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడవద్దు.
- భారీ వర్షాల సమయంలో కారు ,ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేటప్పుడు వాటిని రోడ్డు పక్కన ఆపేసి మీరు కాంక్రీట్ భవనాల్లో తల దాచుకోండి.
- రహదారులపై విద్యుత్ తీగలపడిన చోట,మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండండి .చిన్నారులను ఇంటి నుంచి బయటికి పంపవద్దు.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి
Comments
Post a Comment