వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం
మరో మూడు నెలల్లో ఐఫోన్- 18 సిరీస్ మోడల్ మార్కెట్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆ ఫోన్ ధరల పెంపుపై మార్కెట్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటికి తెరదించుతూ యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఒక ప్రకటన విడుదల చేశారు.
పదవీ విరమణ సమయంలో ..
యాపిల్ సీఈఓ గా కుక్ త్వరలో పదవి విరమణ చేయనున్నారు .ఆయన స్థానంలో జాన్టర్నస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధరల పెంపు భారాన్ని కూడా తన భుజాల మీద వేసుకునేందుకు సిద్ధమయ్యారు టిమ్ .అందులో భాగంగానే ఆయన ఇటీవల ఓ ప్రకటన విడుదల చేశారు. ఐఫోన్ 18 మోడల్స్ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు..
విడిభాగాల ధరలు పెరిగిన నేపథ్యంలో..
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ చిప్ లకు కొరత ఏర్పడింది. అంతేగాక విడిభాగాల ధరలు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. ముడి సరకులు సరఫరా చేసే సంస్థలు కూడా చేతులు ఎత్తేస్తున్నాయి. ఇరాక్ -ఇజ్రాయిల్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది .అనుకున్న సమయానికి ముడి పదార్థాలను గమ్యస్థానాలకు చేరవేయ లేకపోతున్నారు. ఇది క్రమేనా వస్తువుల ధరలు పెరుగుదలకు కారణమైంది.
ఎక్కువ రోజులు భరించలేం …
సరఫరా వ్యవస్థ దెబ్బ తినడంతో ప్రతి చిన్న భాగం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి .ఈ భారాన్ని ఎక్కువ రోజులు మోయ లేమని టిమ్ కుక్ చెప్పుకొచ్చారు.
150 డాలర్ల మేర...
పెరిగిన ముడి పదార్థాల ధరల నేపథ్యంలో ఐఫోన్ 18 తయారీకి అదనంగా 150 డాలర్ల భారం పడుతుందని టిమ్ చెప్పారు. మరి వినియోదారులపై ఎంత భారం మోపుతారో చూడాలంటే కొన్ని రోజులు పాటు వేసి ఉండక తప్పదు.
నేను కూడా మీలాగే ఐఫోన్- 18 మోడల్ కోసం వెయిట్ చేస్తున్నాను .అందులో ఫీచర్లు ఎంత ఎట్రాక్టివ్ గా ఉంటాయో తెలుసుకోవాలని తహతహలాడుతున్నాను.
ఇలాంటి మరింత సమాచారం కోసం మా
తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
Comments
Post a Comment