తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్

 



యమునా పుష్కరాలకు వెళ్లే భక్తులకు శుభవార్త.

 

యమునా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఐ ఆర్ సి టి సి ఒక ప్రత్యేక ప్యాకేజీని తీసుకోవచ్చింది. అయోధ్య, కాశీ, ప్ ప్రయాగ్ రాజు,బైద్యనాథ్, పూరి కోణార్క్ సారనాథ్, యమునా పుష్కరాల స్నానాల నిమిత్తం భారత్ గౌరవ్ పేరుతో ఒక ప్రత్యేక టూరును ప్రారంభించింది. 


ప్రారంభ తేదీ…జూన్ 3 

ఎన్ని రోజులు…మొత్తం పది రోజులు 

దర్శించే పుణ్యక్షేత్రాలు.. పూరి కోణార్క్ వైద్యనాథ్ కాశి అయోధ్య ప్రయాగ్రాజ్..


ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఈ రైలు ఆగే స్టేషన్లు ..

సికింద్రాబాద్, హైదరాబాద్ ,వరంగల్, కాజీపేట, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తనుకు, నిడదవోలు ,సామర్లకోట, రాజమండ్రి ,తుని, దువ్వాడ, పెందుర్తి. 


యాత్ర సాగుతుంది ఇలా


మొదటిరోజు 

సంబంధిత స్టేషన్లో ప్రయాణికులు ఎక్కుతారు. ఆ రోజంతా జర్నీలోనే ఉంటారు. 


రెండో రోజు 

పూరీ లో రైలు ఆగుతుంది. అక్కడ హోటల్లో స్టే చేస్తారు. జగన్నాథ ఆలయాన్ని దర్శించుకుంటారు. 


మూడో రోజు 

బ్రేక్ ఫాస్ట్ అనంతరం కోణార్క్ సూర్య దేవాలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం మాలతి తత్పూర్ స్టేషన్ లో రైలు ఎక్కుతారు.


నాలుగో రోజు 

జార్ఖండ్ లోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రమైన వైద్యనాథ్ దర్శనం అనంతరం కాశీ బయలుదేరుతారు. 


ఐదో రోజు 




కాశీ చేరుకొని బస్సులో సారనాథ్ వెళ్తారు. అక్కడే బస చేస్తారు.


ఆరో రోజు 

బ్రేక్ఫాస్ట్ అనంతరం కాశి చేరుకుంటారు .ఆ రోజు మొత్తం కాశి విశ్వనాథ ఆలయం, అన్నపూర్ణ దేవి ఆలయం, సిటీ టూర్ ,సాయంత్రానికి గంగా హారతి వీక్షిస్తారు. 


ఏడో రోజు 

కాశీ నుంచి అయోధ్య చేరుకుంటారు .అయోధ్యలో రామ్ మందిరం, స్థానిక ఆలయాలను దర్శించుకుంటారు .అనంతరం రైల్వే స్టేషన్ కి వస్తారు .


ఎనిమిదో రోజు 

రైల్లో త్రివేణి సంగమం చేరుకుంటారు. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం లో యమునా పుష్కర స్నానం చేస్తారు .అనంతరం స్థానిక ఆలయాలు దర్శిస్తారు .తిరిగి రైలులో సికింద్రాబాద్ ,విజయవాడ బయలుదేరుతారు. 


9 …10 రోజులు 

ఈ రెండు రోజులు రైల్లోనే జర్నీ ఉంటుంది. ప్రయాణికులకు భోజన వసతి సదుపాయం కల్పిస్తారు.

ముఖ్యమైన ప్రాంతాల్లో రైలు ఆగుతుంది.అక్కడ ప్రయాణికులు దిగిపోతారు. జూన్ 12న యాత్ర ముగుస్తుంది. 


టూర్ ధరలు 


స్లీపర్ క్లాస్ ఒక్కరికి 16,000.. పిల్లలకు.. 15,600 

థర్డ్ ఏసి.. ఒకరికి.. 26, 100.. పిల్లలకు..24,800

సెకండ్ ఏసి ..34100.. పిల్లలకు..32500


టికెట్లు లభించే కేంద్రాలు ..


సికింద్రాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్ లోని ఐఆర్సిటిసి కేంద్రాల్లో టికెట్లు లభిస్తాయి. 

లేకపోతే www.irctc tourism.com 

అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.


ఇంకెందుకు ఆలస్యం. ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుని యాత్రకు ఏర్పాట్లు చేసుకోండి. 


జై యమునా మాత..


 ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏