తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

సెప్టెంబర్ నెలలో తిరుమల వెళ్ళాలనుకుంటున్నారా అయితే మీకు గుడ్ న్యూస్


 దర్శనం టికెట్లు విడుదల చేసే తేదీలు ఇవే..


తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించాలనే భక్తులకు దేవస్థానం ఒక కీలక ప్రకటన చేసింది .సెప్టెంబర్ నెల ఆర్జిత సేవ, ,దర్శనం, రూముల టికెట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. ఆసక్తి గల భక్తులు దేవస్థానం అధికారిక website ద్వారానే తమ లావాదేవీ నిర్వహించాలని సూచించింది. బ్రోకర్ల మాటలు విని ఇబ్బందులు పడవద్దు అని కోరింది.


శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ఏ సేవా టికెట్లు, ఏ రోజు విడుదలవుతాయో తెలుసుకొని తమ టూర్ ని ప్లాన్ చేసుకుంటే స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా , భక్తి ప్రపత్తులతో పూర్తి చేసుకోవచ్చు.


అంగప్రదక్షిణ, శ్రీవాణి, సీనియర్ సిటిజన్స్..




సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్ల quota జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్ల కోటాను జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు, వృద్ధులు వికలాంగుల దర్శన కోటాను జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో ఉంచుతారు.

శ్రీవారి ఆర్థిక సేవా టికెట్లు లక్కీ డిప్..



సుప్రభాతం, తోమాల సేవ అష్టదళ పాద పద్మారాధన టికెట్లను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం భక్తులు జూన్ 20వ తేదీ వరకు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తుల వివరాలను అదే రోజు రిలీజ్ చేస్తారు. జూన్ 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు భక్తులు డబ్బులు కట్టి తమ టికెట్లను కన్ఫర్మ్ చేసుకోవాలి. 


 300 రూపాయల టికెట్ 


300 రూపాయలు దర్శన టికెట్లను జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. గదుల బుకింగ్ కోటాను జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు 


ఇతర సేవలు 


శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. వర్చువల్ సేవ దర్శన టికెట్ల స్లాట్లను జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు. 


భక్తులు ప్రైవేటు వ్యక్తులను ,దళారులను, దేవస్థానం ఉద్యోగులమని చెప్పే వారిని నమ్మవద్దని తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం ప్రకటించింది. దర్శనం, వసతి టికెట్లను 

Ttdevasthanams.ap.gov.in

వెబ్సైట్ ద్వారా మాత్రమే బుకింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. 


ఏది ఏమైనప్పటికీ ఆ కలియుగ దైవం తిరుమల వెంకన్న దర్శనం సకల భక్తులకు కలగాలని కోరుకుంటూ మరింత సమాచారం కోసం మా telugunewsroom పేజీని ఫాలో చేయాల్సిందిగా కోరుతున్నాం 


🛕నమో వెంకటేశాయ 🙏

🪷ఏడుకొండలవాడా🪷

🙏 వెంకటరమణా గోవిందా గోవిందా.🙏

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్