ఒక్క టికెటు …మూడుసార్లు దర్శనాలు… కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామినిదర్శించుకోవాలన్నది ప్రతి భక్తుడి కోరిక .ఒక్కసారి ఆ దైవాన్ని కనురాల చూస్తే జన్మ ధన్యమైంది అని భావిస్తారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రవేశపెట్టిన ఒక నూతన పథకంతో ఒక టికెట్ పై మూడుసార్లు స్వామివారిని దర్శించుకోవచ్చు. అదే పవిత్రోత్సవం టికెట్ తిరుమలలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 22న అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి .ఏడాది పొడవునా ఆలయంలో జరిగే పూజల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతాయి. ఈ కారణంగా ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఈ వేడుకలు నిర్వహిస్తారు .ఈ సేవలో పాల్గొనే వారు ఈ నెల 21న ఆన్లైన్లో జారీ చేసే టికెట్లను కొనుగోలు చేయాలి.ఉదయం 10 గంటలకు విడుదల చేసే ఈ టికెట్ ధరను ఇద్దరికి కలిపి 5000గా నిర్ణయించారు .టికెట్లు పొందిన భక్తులు పవిత్రోత్సవాలు జరిగే మూడు రోజులు స్స్నాపన తిరుమంజనంలో,మూడోరోజు జరిగే పూర్ణాహుతిలో పాల్గొనవచ్చు ఇంకెందుకు ఆలస్యం .. ఇప్పటి నుంచే ఆ టికెట్లు పొందేందుకు సమాయత్తం అవ్వండి. ఇలాంటి మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రూమును ఫా...
Comments
Post a Comment