తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

🕉️ జూన్ 17, 2026 (బుధవారం) తెలుగు పంచాంగం

Image
  📅 తేదీ: 17 జూన్ 2026, బుధవారం 🌅 సూర్యోదయం: ఉదయం 5:46 🌇 సూర్యాస్తమయం: సాయంత్రం 6:47  🪔 తిథి శుక్ల తదియ రాత్రి 9:38 వరకు అనంతరం శుక్ల చవితి ప్రారంభం  ⭐ నక్షత్రం పునర్వసు మధ్యాహ్నం 1:36 వరకు తరువాత పుష్యమి  🔱 యోగం ధృవ యోగం రాత్రి 8:50 వరకు తరువాత వ్యాఘాత యోగం  ⏰ రాహుకాలం మధ్యాహ్నం 12:17 PM – 1:54 PM  ⚠️ యమగండం ఉదయం 7:23 AM – 9:01 AM  🚫 గుళిక కాలం ఉదయం 10:39 AM – 12:17 PM  ✨ అమృత కాలం 11:28 AM – 12:54 PM  🌙 విశేషం చంద్ర దర్శనం శుభదినంగా పరిగణించబడుతుంది.  🕉️ ఈరోజు శుభ సూచన  దైవ దర్శనం, గురు పూజ, దాన ధర్మాలు చేస్తే శుభం

జూన్ 26 నుంచి తిరుమలలో సాల కట్ల జేష్ఠాభిషేకం

 



పలు రకాల సేవలు రద్దు..

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా సాల కట్ల జేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 28న కొన్నిరకాల సేవలను రద్దు చేశారు. 


ఆనవాయితీ ప్రకారం …

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా, మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. జేష్ట నక్షత్రం ముగిసేలా ఈ అభిషేక ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 


ఉత్సవమూర్తుల రక్షణ కోసం..



నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజల నుంచి ఈ అభిషేక విగ్రహాలు అరిగిపోకుండా చూడడమే ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ మూడు రోజులు పాటు స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక కవచాలు సమర్పిస్తారు. 


జూన్ 26 (మొదటిరోజు)..

శ్రీ మల్లప్ప స్వామికి సంవత్సరం పొడవునా ఉన్న పాత కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత స్నాపన తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు. 


జూన్ 27 (రెండో రోజు)...

రెండో రోజు ప్రత్యేక తిరుమంజనాధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి ముత్యాల కవచాన్ని తొడుగుతారు. 


జూన్ 28 (మూడోరోజు)..



చివరి రోజు స్వామివారికి సంప్రదాయ రీతిలో తిరుమంజనాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం బంగారు కవచాన్ని తొడుగుతారు

ఈ బంగారు కవచాన్ని స్వామివారికి ఏడాది పొడవునా ఉంచుతారు .మళ్ళీ సాలకట్ల జేష్ఠోత్సవం వచ్చినంత వరకు ఉంచుతారు. అప్పటివరకు జరిగే అభిషేకాలు, పూజలు అన్ని అదే కవచంపై నిర్వహిస్తారు. 


జూన్ 28 ఆర్జిత సేవలు రద్దు 


సాలకట్ల జేష్ఠభిషేక ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన జూన్ 28న పలు రకాల సేవలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించారు .

ఆ సేవలు ఇవే..

కళ్యాణోత్సవం 

ఉంజల్ సేవ 

ఆర్చిత బ్రహ్మోత్సవాలు..


పై సేవల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ మార్పును గమనించి దానికి అనుగుణంగా తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిబంధనలకు అనుగుణంగా వారికి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.

భక్తులందరికీ తిరుమల వెంకటేశ్వరుని కరుణాకటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాం.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో అవ్వండి.








Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్