తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

జూన్ 26 నుంచి తిరుమలలో సాల కట్ల జేష్ఠాభిషేకం

 



పలు రకాల సేవలు రద్దు..

కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏటా సాల కట్ల జేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలను పురస్కరించుకొని జూన్ 28న కొన్నిరకాల సేవలను రద్దు చేశారు. 


ఆనవాయితీ ప్రకారం …

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా, మూడు రోజులు పాటు నిర్వహిస్తారు. జేష్ట నక్షత్రం ముగిసేలా ఈ అభిషేక ఉత్సవాలు నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. 


ఉత్సవమూర్తుల రక్షణ కోసం..



నిత్యం జరిగే వివిధ రకాల అభిషేకాలు, పూజల నుంచి ఈ అభిషేక విగ్రహాలు అరిగిపోకుండా చూడడమే ఈ ఉత్సవ ప్రత్యేకత. ఈ మూడు రోజులు పాటు స్వామి వారి విగ్రహాలకు ప్రత్యేక కవచాలు సమర్పిస్తారు. 


జూన్ 26 (మొదటిరోజు)..

శ్రీ మల్లప్ప స్వామికి సంవత్సరం పొడవునా ఉన్న పాత కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత స్నాపన తిరుమంజనం (పవిత్ర స్నానం) నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి పూజలు చేస్తారు. 


జూన్ 27 (రెండో రోజు)...

రెండో రోజు ప్రత్యేక తిరుమంజనాధి కార్యక్రమాలు ముగిసిన తర్వాత స్వామివారికి ముత్యాల కవచాన్ని తొడుగుతారు. 


జూన్ 28 (మూడోరోజు)..



చివరి రోజు స్వామివారికి సంప్రదాయ రీతిలో తిరుమంజనాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అనంతరం బంగారు కవచాన్ని తొడుగుతారు

ఈ బంగారు కవచాన్ని స్వామివారికి ఏడాది పొడవునా ఉంచుతారు .మళ్ళీ సాలకట్ల జేష్ఠోత్సవం వచ్చినంత వరకు ఉంచుతారు. అప్పటివరకు జరిగే అభిషేకాలు, పూజలు అన్ని అదే కవచంపై నిర్వహిస్తారు. 


జూన్ 28 ఆర్జిత సేవలు రద్దు 


సాలకట్ల జేష్ఠభిషేక ఉత్సవాలను పురస్కరించుకొని చివరి రోజైన జూన్ 28న పలు రకాల సేవలను రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రకటించారు .

ఆ సేవలు ఇవే..

కళ్యాణోత్సవం 

ఉంజల్ సేవ 

ఆర్చిత బ్రహ్మోత్సవాలు..


పై సేవల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు ఈ మార్పును గమనించి దానికి అనుగుణంగా తమ దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు. ఆలయ నిబంధనలకు అనుగుణంగా వారికి దర్శనం కల్పిస్తామని ప్రకటించారు.

భక్తులందరికీ తిరుమల వెంకటేశ్వరుని కరుణాకటాక్షాలు లభించాలని కోరుకుంటున్నాం.


ఇలాంటి మరింత సమాచారం కోసం మా 

తెలుగు న్యూస్ రూమ్

 పేజీని ఫాలో అవ్వండి.








Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్