తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి
విరాళాలు ఇచ్చే దాతలకు శ్రీవాణి టికెట్టు
- Get link
- X
- Other Apps
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు
శ్రీవాణి టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసింది. ఎవరైతే స్వామివారికి విరాళాలు ఇచ్చి దర్శనం కోసం వేచి ఉంటారో వారికి కొంత మేర శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.
కేటాయింపులు ఇలా
ప్రతిరోజు సుమారు 1500 శ్రీవాణి టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు .వీటిలో 500 ఆన్లైన్లో,, 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో విక్రయిస్తున్నారు. మిగిలిన టిక్కెట్లను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ టిక్కెట్లలో 300 టికెట్లను దాతలకు కేటాయిస్తారు
అర్హత
2025 మే ఒకటో తేదీ నుంచి విరాళాలు అందించిన దాతలు ఈ టికెట్లు పొందడానికి అర్హులు.
ఈ విధానం అమలయ్యే తేదీ
జూన్ 10 నుంచి టికెట్ల జారీ… దర్శన వేళలు
ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 300 టికెట్లు ఆన్లైన్ లో కేటాయిస్తారు .భక్తులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ టికెట్లు పొందాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారికి శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఒకవేళ ఈ టికెట్లు గనుక మిగిలిపోతే వాటిని శ్రీవాణి కరెంట్ బుకింగ్ లో విక్రయిస్తారు.
ఎప్పటి వరకు అమలు
2027 మార్చి 31 వరకు
భక్తులందరికీ ఆ శ్రీనివాసుని దర్శన కటాక్షం కలగాలని కోరుతూ
🙏ఓం నమో వెంకటేశాయ 🙏
ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment