తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

విరాళాలు ఇచ్చే దాతలకు శ్రీవాణి టికెట్టు

 




  తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలు 


శ్రీవాణి టికెట్ల కేటాయింపులో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక మార్పులు చేసింది. ఎవరైతే స్వామివారికి విరాళాలు ఇచ్చి దర్శనం కోసం వేచి ఉంటారో వారికి కొంత మేర శ్రీవాణి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది.



కేటాయింపులు ఇలా 

ప్రతిరోజు సుమారు 1500 శ్రీవాణి టికెట్లను అధికారులు జారీ చేస్తున్నారు .వీటిలో 500 ఆన్లైన్లో,, 200 టికెట్లు రేణిగుంట విమానాశ్రయంలో విక్రయిస్తున్నారు. మిగిలిన టిక్కెట్లను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయిస్తున్నారు. ఈ టిక్కెట్లలో 300 టికెట్లను దాతలకు కేటాయిస్తారు


అర్హత

2025 మే ఒకటో తేదీ నుంచి విరాళాలు అందించిన దాతలు ఈ టికెట్లు పొందడానికి అర్హులు.


ఈ విధానం అమలయ్యే తేదీ 

జూన్ 10 నుంచి  టికెట్ల జారీ… దర్శన వేళలు 

ప్రతిరోజు ఉదయం 9 గంటలకు 300 టికెట్లు ఆన్లైన్ లో కేటాయిస్తారు .భక్తులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ టికెట్లు పొందాలి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారికి శ్రీవారి దర్శనం లభిస్తుంది. ఒకవేళ ఈ టికెట్లు గనుక మిగిలిపోతే వాటిని శ్రీవాణి కరెంట్ బుకింగ్ లో విక్రయిస్తారు. 


ఎప్పటి వరకు అమలు 

2027 మార్చి 31 వరకు 


భక్తులందరికీ ఆ శ్రీనివాసుని దర్శన కటాక్షం కలగాలని కోరుతూ 


🙏ఓం నమో వెంకటేశాయ 🙏


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్

పేజీని ఫాలో అవ్వండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్