తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

తలనీలాల సమర్పణలు రికార్డులు తిరగ రాసిన తిరుమల తిరుపతి దేవస్థానం

 


వెంకటేశ్వరుని సన్నిధిలో


కలియుగ వైకుంఠం ,భక్తుల కోరికలు తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినీ ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తమ కోరికలు తీర్చి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు. 


ఏటా తిరుమలలో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికల్ని వెంటనే నెరవేరుస్తున్నాడని అర్థం. 


స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులు కూడా కోరికలు తీరిన వెంటనే కాలిమార్గాన కొండకు చేరుకొని తలనీనాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది తలనీలాల సమర్పణలో తిరుమల తిరుపతి దేవస్థానం తన రికార్డును అధిగమించింది. 


గత ఐదు నెలల్లో ..

గత ఐదు నెలల స్వామి వారికి 12 లక్షల మందికి పైన తలనీలాలు సమర్పించారు .ఈ ఏడాది మే 27 నాటికి 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. 2024 మే నాటికి 10.65 లక్షలు మంది తలనీనాలు ఇచ్చారు .ఇదే ఇప్పటివరకు రికార్డు. 2025 లో 10.18 లక్షల మంది ఇవ్వగా 2026 లో రెండు లక్షల మంది అధికంగా తలనీలాలు సమర్పించారు .


ఏది ఏమైనా పడితే తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారిని కనులారా దర్శించి కోరిన కోరిక నెరవేరుతున్నది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. 


అందరికీ ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ..


🙏 ఓం నమో వెంకటేశాయ 🙏


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్