తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి
తలనీలాల సమర్పణలు రికార్డులు తిరగ రాసిన తిరుమల తిరుపతి దేవస్థానం
- Get link
- X
- Other Apps
వెంకటేశ్వరుని సన్నిధిలో
కలియుగ వైకుంఠం ,భక్తుల కోరికలు తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినీ ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తమ కోరికలు తీర్చి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు.
ఏటా తిరుమలలో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికల్ని వెంటనే నెరవేరుస్తున్నాడని అర్థం.
స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులు కూడా కోరికలు తీరిన వెంటనే కాలిమార్గాన కొండకు చేరుకొని తలనీనాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది తలనీలాల సమర్పణలో తిరుమల తిరుపతి దేవస్థానం తన రికార్డును అధిగమించింది.
గత ఐదు నెలల్లో ..
గత ఐదు నెలల స్వామి వారికి 12 లక్షల మందికి పైన తలనీలాలు సమర్పించారు .ఈ ఏడాది మే 27 నాటికి 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. 2024 మే నాటికి 10.65 లక్షలు మంది తలనీనాలు ఇచ్చారు .ఇదే ఇప్పటివరకు రికార్డు. 2025 లో 10.18 లక్షల మంది ఇవ్వగా 2026 లో రెండు లక్షల మంది అధికంగా తలనీలాలు సమర్పించారు .
ఏది ఏమైనా పడితే తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారిని కనులారా దర్శించి కోరిన కోరిక నెరవేరుతున్నది అనడానికి ఇదే ఒక ఉదాహరణ.
అందరికీ ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ..
🙏 ఓం నమో వెంకటేశాయ 🙏
ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్
పేజీని ఫాలో అవ్వండి.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment