తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

తలనీలాల సమర్పణలు రికార్డులు తిరగ రాసిన తిరుమల తిరుపతి దేవస్థానం

 


వెంకటేశ్వరుని సన్నిధిలో


కలియుగ వైకుంఠం ,భక్తుల కోరికలు తీర్చే ఆ తిరుమల వెంకటేశ్వర స్వామినీ ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తమ కోరికలు తీర్చి జీవితంలో సుఖసంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటారు. ఆ కోరికలు నెరవేరితే మళ్ళీ కొండకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారు. 


ఏటా తిరుమలలో తలనీలాలు సమర్పించే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఆ వెంకటేశ్వరుడు భక్తుల కోరికల్ని వెంటనే నెరవేరుస్తున్నాడని అర్థం. 


స్వామివారి ఆజ్ఞ ప్రకారం భక్తులు కూడా కోరికలు తీరిన వెంటనే కాలిమార్గాన కొండకు చేరుకొని తలనీనాలు సమర్పిస్తున్నారు. అయితే ఈ ఏడాది తలనీలాల సమర్పణలో తిరుమల తిరుపతి దేవస్థానం తన రికార్డును అధిగమించింది. 


గత ఐదు నెలల్లో ..

గత ఐదు నెలల స్వామి వారికి 12 లక్షల మందికి పైన తలనీలాలు సమర్పించారు .ఈ ఏడాది మే 27 నాటికి 12.43 లక్షల మంది తలనీలాలు సమర్పించినట్టు దేవస్థానం రికార్డులు చెబుతున్నాయి. 2024 మే నాటికి 10.65 లక్షలు మంది తలనీనాలు ఇచ్చారు .ఇదే ఇప్పటివరకు రికార్డు. 2025 లో 10.18 లక్షల మంది ఇవ్వగా 2026 లో రెండు లక్షల మంది అధికంగా తలనీలాలు సమర్పించారు .


ఏది ఏమైనా పడితే తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారిని కనులారా దర్శించి కోరిన కోరిక నెరవేరుతున్నది అనడానికి ఇదే ఒక ఉదాహరణ. 


అందరికీ ఆ తిరుమల వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుతూ..


🙏 ఓం నమో వెంకటేశాయ 🙏


ఇలాంటి మరింత సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ 

పేజీని ఫాలో అవ్వండి.



Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్