తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

🔥 రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం.. తిరుమలలో భక్తుల వెల్లువ!

 



ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సహకారంతో..


కలియుగ వైకుంఠం, కోరిన కోరికలు తీర్చే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. వేసవి సెలవు నేపథ్యంలో కర్ణాటక ,తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు దర్శన విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. ఇది ఆశించిన సత్ఫలితాన్ని ఇస్తుంది.


గతంలో భక్తుల దర్శనానికి మాన్యువల్ విధానాన్ని పాటించేవారు. సిబ్బంది ద్వారా రద్దీ ఎక్కడ ఉందో తెలుసుకొని ఆ క్యూ లైన్ ముందు వదిలేవారు. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో ఈ విధానం ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు .తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఐసీసీకి రూపకల్పన చేశారు. నడక మార్గం, మెట్ల మార్గం లో ఎంత మంది భక్తులు తిరుమలకు వస్తున్నారు. ఏ క్యూ లైన్ లో ఎక్కువ రద్దీగా ఉంది అన్నది తెలుసుకొని క్షణాల్లోనే ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తున్నారు. 



మే 22న అత్యధిక మందికి దర్శన భాగ్యం 

మే 22 శుక్రవారం .సాధారణంగా శుక్రవారం రోజున అభిషేక సేవ ఉంటుంది. ఈ కారణంగా దర్శన సమయాన్ని కుదిస్తారు. తిరుపతి దేవస్థానం వారు తీసుకొచ్చిన కొత్త నిబంధన కారణంగా అభిషేక సేవ సమయంలోను భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కారణంగా కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న సుమారు 5800 మందికి అదనంగా దర్శన భాగ్యం కలిగింది. 

ఆ ఒక్క రోజే స్వామివారిని 94,758 మంది దర్శించుకున్నారు. 


మే నెలలో నాలుగో సారీ 


వేసవి నేపథ్యంలో ఒక మే నెలలోనే స్వామివారిని రోజుకు 90,000 మంది చొప్పున నాలుగు రోజులు పాటు భక్తులు దర్శించుకున్నారు. ఇది భక్తులకు దర్శన భాగ్యాన్ని, తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనుసరిస్తున్న నూతన విధానాలు ఏ విధంగా ఫలితాలు ఇచ్చాయి అన్నది సూచిస్తుంది.భవిష్యత్తులోనూ ఇంకా మెరుగైన పద్ధతులు పాటించి భక్తులకు సత్వరమే, సులువుగా, సౌకర్యవంతంగా ఆ వెంకటేశ్వర స్వామి దర్శనభాగం కల్పించాలని కోరుతున్నాం. 


ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని

 ఫాలో అవ్వండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్