తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

🌊 యమునా పుష్కరాలకు ఆహ్వానం – పుణ్యస్నానం చేద్దాం!




 


      పుష్కర స్నానం ప్రాముఖ్యత


భారతదేశంలోని అతి ప్రముఖమైన నదుల్లో యమునా నది ఒకటి. 12 సంవత్సరాలకు ఒకసారి ఈ నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 13 వరకు పుష్కరాలు జరగనున్నాయి.


నదీ జన్మస్థలం 


ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ యమునోత్రి నది జన్మించింది. యమునా దేవిని సూర్యదేవుని కుమార్తెగా ,యమధర్మరాజు సోదరిగా భావిస్తారు. యమునా దేవిని పూజిస్తే మృత్యుభయం తొలగిపోతుంది, పాపాలు నశిస్తాయి. పితృ దోషాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. 


పుష్కరాల చరిత్ర 


పూర్వం పుష్కరుడు అనే దేవతకు బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు.గురుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరుడు ప్రవేశించి పవిత్రం చేస్తాడని ఆ వరం యొక్క ఉద్దేశం. 


1. పుష్కరాల సమయంలో దేవతలు నదీ స్నానం చేస్తారని విశ్వాసం. 

2. త్రిమూర్తుల ఆశీస్సులు మెండుగా లభిస్తాయి అన్నది నమ్మకం. 



పుష్కర సమయంలో చేసే ప్రధాన ఆచారాలు 


  • 1. నదీ స్నానం ఆ సమయంలో నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు తొలగుతాయి. 
  • 2. ఆరోగ్యము, ఆయుష్షు ఐశ్వర్యం పెరుగుతుందని విశ్వాసం.


జపించాల్సిన మంత్రం 


యమునే హరమే పాపం 



పితృ తర్పణాలు 

పుష్కర సమయంలో చిత్ర దేవతలకు తర్పణాలు వదులుతారు.

ఇలా చేయడం వల్ల వారు శాంతించి పితృ దోషాలు తొలగిపోతాయి. కుటుంబ సమస్యలు తీరి  వంశాభివృద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. 


దానాలు 

పుష్కర సమయంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది.

చేయాల్సిన ముఖ్యమైన దానాలు 


1. అన్నదానం 
2. వస్త్ర దానం 
3. విద్యా దానం 
4. గోదానం 
5. సువర్ణ దానం 
6. బ్రాహ్మణ సత్కారం 


యమునా పుష్కరాలు జరిగే ముఖ్య ప్రదేశాలు 




1. మధుర  .. శ్రీకృష్ణ జన్మస్థలం. ఇక్కడ స్నానాలుకనువుగా  వాటికలు ఉంటాయి 

2. బృందావనం .. శ్రీకృష్ణ రాసలీలలకు ఎంతో ప్రసిద్ధి చెందింది 

3. ప్రయాగ్రాజ్ .. త్రివేణి సంగమం గంగా, యమునా, సరస్వతి నదులు సంఘం. 

4. ఢిల్లీ .. యమునా నది ఒడ్డున 

5. యమునోత్రి .. చార్ ధాం యాత్రలో మొట్టమొదటి పుణ్యక్షేత్రం.


పుష్కరాల ముఖ్య తేదీలు 



ప్రారంభం. జూన్ 2 2026


పవిత్రమైన తొలి 12 రోజులు. 


జూన్ రెండు నుంచి జూన్ 13 వరకు 


అంత్య పుష్కరాల ముగింపు 

జూన్ 13.



స్నానానికి ఉత్తమ సమయం 


ఉదయం 4:30 నుంచి 7 వరకు 


ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ పేజీని ఫాలో అవ్వండి.







Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్