తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

పెద్ది సినిమాకు కష్టాలు తీరేనా …

 


పెద్ది సినిమాకు కష్టాలు తీరేనా …

చలనచిత్ర వాణిజ్యమండలిలో శుక్రవారం 

నిర్మాతలు ,ఎగ్జిబిటర్ల సమావేశం 

 సింగిల్ స్క్రీన్ ధియేటర్ యాజమాన్యాలకు ,నిర్మాతలకు మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి . శుక్రవారం చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు దగ్గుబాటి సురేష్ బాబు నేతృత్వంలో రెండు వర్గాలు చర్చలకు అంగీకరించారు. తమకు కూడా మల్టీప్లెక్స్ మాదిరిగా షేరింగ్ ఇవ్వాలని సింగిల్ స్క్రీన్ థియేటర్లో యాజమాన్యం వారు నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారు. వారి కోరికలను నిర్మాతలు అంగీకరించడం లేదు. 


సౌకర్యాలు కల్పిస్తేనే ప్రేక్షకుల రాక 

దీనిపై నిర్మాతలు కొన్ని అభ్యంతరాలు లేవలెత్తుతున్నారు సింగిల్ స్క్రీన్ యాజమాన్యాల వారు తమ థియేటర్లో మంచి సౌండింగ్ సిస్టం, సీటింగ్ మోడిఫికేషన్, లైటింగ్ ,పార్కింగ్, సేఫ్టీ తదితర అంశాలను మెరుగుపరుచుకుంటే ప్రేక్షకులు వస్తారని అవన్నీ చేయకుండా నిర్మాతల మీద పడితే తాము ఏమీ చేయలేము అని వాదిస్తున్నారు. ఇదే సమయంలో యాజమాన్యం వారు మాత్రం సినిమా రిలీజ్ విషయంలో మల్టీప్లెక్స్ లకు ఇచ్చినంత ప్రయారిటీ తమకు ఇవ్వడం లేదని తమకు కూడా తగిన ప్రాముఖ్యతను ఇస్తే ఆ వచ్చే ఆదాయంతో థియేటర్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నారు.


ప్రేక్షకుల మాత్రం.. రెండు వర్గాలు సమస్యలను పరిష్కరించుకొని పెద్ది సినిమాను సకాలంలో రిలీజ్ చేసి తమకు ఆనందం కలిగించాలని కోరుకుంటున్నారు.


ఇలాంటి మరిన్ని అప్డేట్లు కోసం Telugu NewsRoom 🗞️ నీ follow చెయ్యండి.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్