తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి
హైదరాబాద్ క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లు
- Get link
- X
- Other Apps
ఆర్సీబీ మ్యాచ్ కు భారీగా పెరిగిన టికెట్ల ధరలు
ఈనెల 22న హైదరాబాదులో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సిబి బెంగళూరు మధ్య జరిగే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు .దీనికి నిదర్శనం నిన్న ఆన్లైన్లో జరిగిన టికెట్ల అమ్మకాలే. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,000. కానీ ఆన్లైన్ లో టికెట్లు కొనేందుకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బాగానే సొమ్ము చేసుకుంది .టిక్కెట్ల ధరలను విపరీతంగా పెంచేశారు .అయినప్పటికీ అమ్మకాలు ప్రారంభమైన కొద్దిసేపటికి సోల్డ్ అవుట్ అని యాప్ లో కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో సన్రైజర్స్ యాజమాన్యం పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం సరికాదని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు .కాసుల దాహం తీర్చుకునేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి.
టికెట్ల ధరలు
కనిష్ట ధర 1950
గరిష్ట ధర 45000
సౌత్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 45,000.
వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 30,000.
ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్ వెస్ట్ లాంజ్ ధరలు 20,000.
ఈస్ట్, వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రేట్ 4500
గ్రౌండ్ ఫ్లోర్. 6000
మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రో ఛానల్ ని ఫాలో చేయండి.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment