తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

హైదరాబాద్ క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లు

 


ఆర్సీబీ మ్యాచ్ కు భారీగా పెరిగిన టికెట్ల ధరలు 

ఈనెల 22న హైదరాబాదులో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సిబి బెంగళూరు మధ్య జరిగే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు .దీనికి నిదర్శనం నిన్న ఆన్లైన్లో జరిగిన టికెట్ల అమ్మకాలే. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,000. కానీ ఆన్లైన్ లో టికెట్లు కొనేందుకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బాగానే సొమ్ము చేసుకుంది .టిక్కెట్ల ధరలను విపరీతంగా పెంచేశారు .అయినప్పటికీ అమ్మకాలు ప్రారంభమైన కొద్దిసేపటికి సోల్డ్ అవుట్ అని యాప్ లో కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో సన్రైజర్స్ యాజమాన్యం పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం సరికాదని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు .కాసుల దాహం తీర్చుకునేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి. 


టికెట్ల ధరలు 


కనిష్ట ధర 1950 

గరిష్ట ధర 45000 


సౌత్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 45,000.

వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 30,000.


ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్ వెస్ట్ లాంజ్ ధరలు 20,000.


ఈస్ట్, వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రేట్ 4500

గ్రౌండ్ ఫ్లోర్. 6000


మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రో ఛానల్ ని ఫాలో చేయండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్