తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

వాయనాట్టు కులవన్ దేవస్థానం – కాసరగోడ్, కేరళ | చరిత్ర, విశేషాలు, తేయ్యం, దర్శన సమాచారం

Image
  సాధారణంగా ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు ,అభిషేకాలు, హోమాలు, జపాలు, కళ్యాణోత్సవాలు ,బ్రహ్మోత్సవాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తే పలు సమస్యల నుంచి బయట పడవచ్చు అని మనం వింటుంటాం కానీ భారతదేశంలోని ఈ ఆలయం మాత్రం ఒక విశిష్టమైన మహా శక్తిని కలిగి ఉంది  ఈ ఆలయ ప్రసాదం మన ఇంట్లో ఉంటే కోర్టు కేసుల నుంచి సులువుగా బయటపడవచ్చు అంతేకాక మన శరీరంలో కడుపుకు సంబంధించిన గ్యాస్ ట్రబుల్, అల్సర్, పేగు పుండులు తదితర సమస్యల నుంచి కూడా సులువుగా నయమవుతాయి.  పై మాటలు చదివి ఇదేదో వింతగా ఉంది అనుకుంటున్నారా కానీ 100% అక్షరాలా నిజం. సుప్రీంకోర్టుకు చెందిన పలువురు కక్షీదారులు ప్రతిరోజు ఢిల్లీ నుంచి ఈ ఆలయానికి వచ్చి ఆలయంలో పూజారి విక్రయించే ప్రసాదాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకువెళ్తారు. ఈ ప్రసాదాన్ని దేవుడి గదిలో ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వల్ల మనకు సకల శుభాలు కలుగుతాయి .ఇప్పుడు ఆ ఆలయ విశేషాలు తెలుసుకుందాం రండి.  కేరళ రాష్ట్రంలోని కాసరగుడు జిల్లాలో పలు వాయునట్టు కులవన్ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పలక్ శ్రీ వాయునట్టు కులం దేవస్థానం. ఈ దేవతను గ్రామ రక్షకుడిగా పలువురు ఆరాధిస్తారు...

హైదరాబాద్ క్రికెట్ అభిమానుల జేబులకు చిల్లు

 


ఆర్సీబీ మ్యాచ్ కు భారీగా పెరిగిన టికెట్ల ధరలు 

ఈనెల 22న హైదరాబాదులో సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సిబి బెంగళూరు మధ్య జరిగే ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు పోటీపడ్డారు .దీనికి నిదర్శనం నిన్న ఆన్లైన్లో జరిగిన టికెట్ల అమ్మకాలే. హైదరాబాదు ఉప్పల్ స్టేడియం సామర్థ్యం 39,000. కానీ ఆన్లైన్ లో టికెట్లు కొనేందుకు సుమారు నాలుగు లక్షల మంది పోటీపడ్డారు. అభిమానుల ఉత్సాహాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం బాగానే సొమ్ము చేసుకుంది .టిక్కెట్ల ధరలను విపరీతంగా పెంచేశారు .అయినప్పటికీ అమ్మకాలు ప్రారంభమైన కొద్దిసేపటికి సోల్డ్ అవుట్ అని యాప్ లో కనిపించడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. అదే సమయంలో సన్రైజర్స్ యాజమాన్యం పై అభిమానులు గుర్రుగా ఉన్నారు. క్రికెట్ పై తమకున్న అభిమానాన్ని ఈ విధంగా సొమ్ము చేసుకోవడం సరికాదని, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే యాజమాన్యం మాత్రం ఇవేవీ పట్టించుకోవటం లేదు .కాసుల దాహం తీర్చుకునేలా వాళ్ళ చర్యలు ఉన్నాయి. 


టికెట్ల ధరలు 


కనిష్ట ధర 1950 

గరిష్ట ధర 45000 


సౌత్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 45,000.

వెస్ట్ సెకండ్ ఫ్లోర్ కార్పొరేట్ బాక్స్ ధర 30,000.


ఆరెంజ్ ఆర్మీ ఈస్ట్ వెస్ట్ లాంజ్ ధరలు 20,000.


ఈస్ట్, వెస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ రేట్ 4500

గ్రౌండ్ ఫ్లోర్. 6000


మరింత సమాచారం కోసం తెలుగు న్యూస్ రో ఛానల్ ని ఫాలో చేయండి.


Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్