తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి
అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గించిన ఎయిర్ ఇండియా
- Get link
- X
- Other Apps
ఎయిర్ ఇండియాపై ఇరాన్ యుద్ధ ప్రభావం
ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీస్ లను తగ్గించడంతోపాటు కొన్ని ప్రాంతాలకు ఆగస్టు 29 వరకు సేవలు నిలిపివేసింది.
గగనతల ఆంక్షలు..
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో పాటు గగనతల ఆంక్షలు తమ సేవలపై ప్రభావం చూపాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్వీసులు తగ్గించడానికి కారణం ఏంటంటే పలు దేశాల్లో ఇంధన ధరలు 100 నుంచి 500 శాతానికి పెంచారు.
ఆ భారం భరించలేక
ఒక విమానం ఇండియా నుంచి చికాగో వెళ్ళింది అనుకున్నాం. ఇండియాలో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తారు .అనంతరం చికాగోలో కూడా మళ్లీ ట్యాంక్ ఫుల్ చేయాలి. ఇండియాలో ధరలు సామాన్యంగానే ఉన్నా అమెరికాలో మాత్రం ధరలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో చార్జీలు మాత్రం చాలా తక్కువ శాతం పెంచారు .ఇది ఎయిర్ లైన్స్ కు భారంగా మారింది. గత ఏడాది రూ.22 వేల కోట్లు నష్టాలు చూసిన ఎయిర్ ఇండియాకు ఇది మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో తమ సర్వీసుల ప్రణాళికను తగ్గించుకున్నారు.
హామీతో ఊరట
ఈ సంక్షోభంలో కూడా ఐదు ఖండాలకు ప్రతినెల 1200 సర్వీసులు నడుపుతామని హామీ ఇచ్చారు ఇది ప్రయాణికులకు ఊరట కలిగించే అంశం.ఇప్పటికే మే నెలలో 90 కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. ఈ అంతర్జాతీయ సర్వీసులు దానికి అదనం.
నిలిపివేసిన … తగ్గించిన సర్వీసులు..
ఢిల్లీ - చికాగో , ఢిల్లీ- న్యూయార్క్ ,ముంబై -న్యూయార్క్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు .
ఢిల్లీ -సాన్ ఫ్రాన్సిస్కో వారానికి 10 నుంచి 7 , ఢిల్లీ -టొరంటో వారానికి పది నుంచి ఐదుకు,ఢిల్లీ -వాంకవర్ వారానికి ఏడ్నుంచి ఐదుకు తగ్గించారు.
- Get link
- X
- Other Apps

Comments
Post a Comment