తెలుగు రాష్ట్రాల తాజా వార్తలు, రాజకీయాలు, సినిమా, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ updates తెలుసుకోండి

తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు

Image
  తొలి ఏకాదశి -2026 విశిష్టత పూజా విధానం  ఆరోజు చేయాల్సిన పనులు. శ్రీ మహా విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి జారుకునే రోజే తొలి ఏకాదశి. నాలుగు నెలల తర్వాత వచ్చే ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్ర లేస్తాడు.  శ్రీ మహా విష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు కాబట్టే తొలి ఏకాదశి ఆ సంవత్సరంలో కెల్లా అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తారు. 2026 వ సంవత్సరం జూలై 25 వ తేదీన తొలి ఏకాదశి వస్తుంది. శుభాల కలయిక ఆరోజు ఉపవాస ఉండి శ్రీమహావిష్ణువు పూజిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.  ఆర్థిక సమస్యలు తీరుతాయి . ఆ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది . చాతుర్మాస దీక్షల ప్రారంభానికి మంచి రోజు.  ఆరోజు చేయాల్సిన పనులు … ఆరోజు వేకువ జామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి. పూజ గదిని శుభ్రం చేసి దీపం వెలిగించాలో.శ్రీమహావిష్ణువుని ,శ్రీకృష్ణుడు , శ్రీరాముల వారిని పూజించాలి. ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం ఉండాలి. షుగర్ పేషెంట్లు ఉపవాసాలకు దూరంగా ఉంటే మంచిది.  ఆ రోజున విష్ణు సహస్రనామ పారాయణం చదివితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది.  జపించాల్సిన మంత్రం  ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 స...

అంతర్జాతీయ విమాన సర్వీసులు తగ్గించిన ఎయిర్ ఇండియా



ఎయిర్ ఇండియాపై ఇరాన్ యుద్ధ ప్రభావం

ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సర్వీస్ లను తగ్గించడంతోపాటు కొన్ని ప్రాంతాలకు ఆగస్టు 29 వరకు సేవలు నిలిపివేసింది.


గగనతల ఆంక్షలు..

ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ఎయిర్ ఫ్యూయల్ ధరలు పెరగడంతో పాటు గగనతల ఆంక్షలు తమ సేవలపై ప్రభావం చూపాయని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ సర్వీసులు తగ్గించడానికి కారణం ఏంటంటే పలు దేశాల్లో ఇంధన ధరలు 100 నుంచి 500 శాతానికి పెంచారు. 


ఆ భారం భరించలేక

ఒక విమానం ఇండియా నుంచి చికాగో వెళ్ళింది అనుకున్నాం. ఇండియాలో ఫ్యూయల్ ట్యాంక్ ఫుల్ చేసుకొని వెళ్తారు .అనంతరం చికాగోలో కూడా మళ్లీ ట్యాంక్ ఫుల్ చేయాలి. ఇండియాలో ధరలు సామాన్యంగానే ఉన్నా అమెరికాలో మాత్రం ధరలు బాగా పెరిగాయి. ఇదే సమయంలో చార్జీలు మాత్రం చాలా తక్కువ శాతం పెంచారు .ఇది ఎయిర్ లైన్స్ కు భారంగా మారింది. గత ఏడాది రూ.22 వేల కోట్లు నష్టాలు చూసిన ఎయిర్ ఇండియాకు ఇది మరింత భారంగా మారింది. ఈ నేపథ్యంలో తమ సర్వీసుల ప్రణాళికను తగ్గించుకున్నారు. 


హామీతో ఊరట

ఈ సంక్షోభంలో కూడా ఐదు ఖండాలకు ప్రతినెల 1200 సర్వీసులు నడుపుతామని హామీ ఇచ్చారు ఇది ప్రయాణికులకు ఊరట కలిగించే అంశం.ఇప్పటికే మే నెలలో 90 కి పైగా సర్వీసులను ఎయిర్ ఇండియా నిలిపివేసింది. ఈ అంతర్జాతీయ సర్వీసులు దానికి అదనం.


నిలిపివేసిన … తగ్గించిన సర్వీసులు..

ఢిల్లీ - చికాగో , ఢిల్లీ- న్యూయార్క్ ,ముంబై -న్యూయార్క్ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు .

ఢిల్లీ -సాన్ ఫ్రాన్సిస్కో వారానికి 10 నుంచి 7 , ఢిల్లీ -టొరంటో వారానికి పది నుంచి ఐదుకు,ఢిల్లీ -వాంకవర్ వారానికి ఏడ్నుంచి ఐదుకు తగ్గించారు.

Comments

Popular posts from this blog

చార్‌ధామ్ యాత్రలో ధారా దేవి అమ్మవారి ఆలయం విశిష్టత 🙏

యమునా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు 🚆 భక్తులకు ఐఆర్సిటిసి గుడ్ న్యూస్