తొలి ఏకాదశి 2026 ఎప్పుడు? విశిష్టత, పూజా విధానం, నైవేద్యాలు, ఉపవాస నియమాలు – పూర్తి వివరాలు
మెలోడీ మోడీ కలయిక ప్రతిసారి అంతర్జాతీయ స్థాయిలో వార్తాంశం అవుతుంది. ఇటలీ ప్రధాని మెలోనికి మోడీ అంటే విపరీతమైన అభిమానం. జాతీయ అంతర్జాతీయ వేదికలపై కలిసిన ప్రతిసారి ఆమె మోడీని ప్రత్యేకంగా కలిసి ఇరుదేశాల సంబంధాలపై చర్చిస్తారు. మన ప్రధానితో కలిపిన ప్రతి క్షణాన్ని ఎంతో అద్భుతంగా పేర్కొంటారు.
ఐదు రోజుల యూరప్ పర్యటనలో భాగంగా మోడీ ఇటలీని సందర్శించారు ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని మెలోనీతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. అందులో భాగంగా ఆమెతో సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఆ సెల్ఫీ ఇప్పుడు వైరల్ గా మారింది. తన మిత్రుడు మోదీ తో కలిసి అంతర్జాతీయ అంశాలు, ఇటలీ ఇండియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ ,సాంకేతిక ,క క్లీన్ ఎనర్జీ తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు.
ఏదేమైనప్పటికీ మోడీ ప్రధానిగా అయిన తర్వాత విశ్వ విపనిలో భారత్కు ప్రత్యేక ముద్ర వేశారు. 2014 తర్వాత విదేశాల్లో భారతీయుల గౌరవాన్ని రెట్టింపు చేశారు. దానికి ఆయన చేసిన పర్యటనలు, వివిధ దేశాల నేతలతో జరిపిన సమావేశాలు, చర్చలే కారణం.
జైహింద్…. జై భారత్.
ఇలాంటి మంచి సమాచారం కోసం మా తెలుగు న్యూస్ రూమ్ పేజీని ఫాలో చేయండి
Comments
Post a Comment